టీ20 సిరీస్ బరిలో గిల్
న్యూఢిల్లీ: భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈమేరకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ (సీఓఈ)లో నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో తను పాస్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నాడు. ఇంతకుముందే ఈ సిరీ్సకు అతడిని ఎంపిక చేసినా.. ఫిట్నెస్ ఉంటేనే ఆడతాడని ప్రకటించారు. కోల్కతా టెస్టులో గాయపడ్డాక గిల్ సీఓఈలో పునరావాస శిబిరంలో చేరాడు.










Comments