అద్భుతం.. ఈ నెల 28న గ్రహాల పరేడ్
ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. బృహస్పతి(గురు), బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే దగ్గర కనిపించనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత శుక్రుడు, బుధుడు, శని గ్రహాలను పశ్చిమ దిశలో టెలిస్కోప్తో చూసే అవకాశం ఉంది. వీటికి సమీపంలోనే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడవచ్చు. ఇక బృహస్పతి చంద్రుడి సమీపంలో నేరుగా కనిపించనుంది.










Comments