చంద్రబాబుపై ఫైబర్నెట్ కేసు కొట్టివేత
ఆంధ్ర ప్రదేశ్ : సీఎం చంద్రబాబుకు భారీ ఊరట కలిగింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్నెట్ కేసును ACB కోర్టు కొట్టేసింది. ఇతర నిందితులకూ క్లీన్చిట్ ఇచ్చింది. 2014-19 మధ్య ఫైబర్నెట్లో ₹114Cr స్కామ్ జరిగిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా CID అధికారులు ఆ కేసు దర్యాప్తును ముగించినట్లు కోర్టుకు తెలిపారు. కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని నాటి, నేటి ఫైబర్నెట్ MDలు చెప్పారు. దీంతో కోర్టు తీర్పు వెలువరించింది.










Comments