• Apr 21, 2026
  • NPN Log

    చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. 

    అయితే ఓ హీరోయిన్ మాత్రం సినిమాలో ఓ సీన్ కారణంగా ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది. ఆ సీన్ లో నటించను అని ముందే చెప్పినా దర్శకుడు వినలేదట. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో... ఆ సీన్ ఏంటో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ సదా. 

    దర్శకుడు తేజ సినిమాలతో చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా వచ్చిన వారిలో సదా ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నితిన్ హీరోగా నటించిన జయం సినిమాలో హీరోయిన్ గా సదా నటించాగా విలన్ గా గోపీచంద్ నటించాడు.

    గతంలో సదా జయం సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జయం సినిమాలో ఓ సన్నివేశంలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని ఇంటికెళ్లి మరీ ఏడ్చాను.. ఇప్పటికి కూడా ఆ సీన్ ఎందుకు చేశానా అని చాలా బాధపడ్తాను అని తెలిపింది.

    జయం సినిమాలో విలన్ గోపీచంద్ కూడా సదాను ప్రేమిస్తాడు. అయితే సదా ప్రేమించిన నితిన్ ముందు ఆమె బిగ్గపై నాలుకతో నాకుతాడు. ఈ సన్నివేశం చేసేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను అని సదా తెలిపింది. నేను ఆ సన్నివేశంలో నటించాను అని దర్శకుడికి ముందే చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదట. ఆ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని చెప్పి తనతో చేయించారట. ఆతర్వాత ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది సదా. కానీ జయం సినిమాతో తనకు ఎంతో పేరు వచ్చిందని తెలిపింది. 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement