నేడు జైపూర్కు.. రేపు ఢిల్లీకి సీఎం
ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు ఇవాళ రాజస్థాన్లోని జైపూర్లో పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు. సాయంత్రం ఐఏఎస్ అధికారి వికాస్ మర్మట్ వివాహానికి హాజరుకానున్నారు. రాత్రికి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. 9.30AM నుంచి 4.30PM వరకు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.









Comments