ప్రత్యామ్నాయాలు చూసుకోండి.. కోడర్స్కు వెంబు హెచ్చరిక
ప్రపంచమంతా AI యుగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో కోడింగ్పై ఆధారపడే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన సమయం వచ్చిందని జోహో కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. కోడింగ్ తెలియని వారు కూడా AIతో యాప్స్ తయారు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఓ యూజర్ చేసిన ట్వీట్కు రిప్లై ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మార్పుని అంగీకరించాలని సూచించారు. AI బాధితుల జాబితాలో తాను కూడా ఉన్నానని తెలిపారు.










Comments