మళ్లీ పెరిగిన పసిడి ధరలు..
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, డాలర్ బలహీనపడటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా భారత్లో శనివారం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర సగటున రూ.1900 మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ఆదివారం హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,57,750కు చేరుకుంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.1,970 అధికం. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.1,800ల మేర పెరిగి రూ.1,44,600కు చేరుకుంది. నగరంలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,80,000 వద్ద తచ్చాడుతోంది.
అమెరికన్ కరెన్సీ డాలర్ బలహీనపడ్డ నేపథ్యంలో పసిడి, వెండివైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా సోమవారం నుంచీ బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగారం, వెండిలపై ఇన్వెస్ట్ చేసే వారు డాలర్ విలువపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు (24కే, 22కే)
చెన్నై: ₹1,58,840; ₹1,45,600
ముంబై: ₹1,57,750; ₹1,44,600
న్యూఢిల్లీ: ₹1,57,900; ₹1,44,750
కోల్కతా: ₹1,57,750; ₹1,44,600
బెంగళూరు: ₹1,57,750; ₹1,44,600
హైదరాబాద్: ₹1,57,750; ₹1,44,600
విజయవాడ: ₹1,57,750; ₹1,44,600
కేరళ: ₹1,57,750; ₹1,44,600
పుణే: ₹1,57,750; ₹1,44,600
వడోదరా: ₹1,57,800; ₹1,44,650
అహ్మదాబాద్: ₹1,57,800; ₹1,44,650
వెండి ధరలు
చెన్నై: ₹2,80,000
ముంబై: ₹2,75,000
న్యూఢిల్లీ: ₹2,75,000
కోల్కతా: ₹2,75,000
బెంగళూరు: ₹2,75,000
హైదరాబాద్: ₹2,80,000
విజయవాడ: ₹2,80,000
కేరళ: ₹2,80,000
పుణే: ₹2,75,000
వడోదరా: ₹2,75,000
అహ్మదాబాద్: ₹2,75,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలను తెలుసుకోవాలని సూచన.










Comments