రెండో వాహనం కొనుగోలు చేసేవారికి గుడ్న్యూస్
తెలంగాణ : రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్న్యూస్ చెప్పనుంది. సెకండ్ వెహికల్పై విధిస్తున్న 2 శాతం అదనపు రోడ్డు ట్యాక్స్ను రద్దు చేయాలన్న రవాణాశాఖ ప్రతిపాదనకు సీఎం రేవంత్రెడ్డి అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో వాహనదారులపై ఏటా సుమారు రూ.150 కోట్లకు పైగా భారం తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.










Comments