• Jun 13, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : రష్యా ముడి చమురును కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తిప్పికొట్టారు. రష్యా చమురును కొంటున్నందుకు ప్రశ్నిస్తున్న ఆ దేశాలు.. భారత్‌ ప్రత్యర్థులకు అనేక ఏళ్లుగా ఆయుధాలను విక్రయిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఆయుధాలతోనే భారత్‌పై దాడులు జరుగుతున్నాయన్నారు. అయితే ఇదే సమయంలో భారత ఆయుధాలతో ఇప్పటి వరకు ఏ యూరప్‌ దేశంపైనా దాడి జరగలేదని జైశంకర్‌ స్పష్టం చేశారు. ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలని భారత్‌ను అమెరికా కోరిందని గుర్తు చేశారు. ఫిన్‌లాండ్‌లో గురువారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌.. అక్కడ తనకు ఎదురైన ప్రశ్నలకు ఘాటైన సమాధానాలు ఇచ్చారు. ఆంక్షలు, వాణిజ్యం, ఇంధన భద్రత విషయంలో పశ్చిమ దేశాల విధానాల్లో వైరుధ్యాలను ప్రశ్నించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement