జేసీ దివాకర్రెడ్డి తోటకు నిప్పు
పెద్దపప్పూరు(అనంతపురం): అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని జూటూరు గ్రామం వద్దగల మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చింతతోటకు గుర్తుతెలియని దుండగులు సోమవారం నిప్పుపెట్టారు. మొత్తం 30 ఎకరాల్లో చింతచెట్లు నాటారు. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు తోటకు నిప్పుపెట్టారు. చింతచెట్లు, డ్రిప్పు పైపులు కాలిపోయాయి. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.









Comments