భారత జట్ల హ్యాట్రిక్
సమర్ఖండ్ (ఉజ్బెకిస్థాన్): చెస్ ఒలింపియాడ్లో డిఫెండింగ్ చాంపియన్లు భారత పురుషులు, మహిళల జట్లు హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్నాయి. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో మహిళల జట్టు 3.5-0.5 స్కోరుతో గ్రీస్ను చిత్తు చేసింది. కోనేరు హంపి, వంతిక, సావిత్రి శ్రీ గెలుపొందగా, దివ్యా దేశ్ముఖ్ డ్రా చేసుకుంది. ఓపెన్లో..పురుషుల జట్టు 3-1 స్కోరుతో ఇటలీని ఓడించింది. గుకేష్, నిహాల్ సరీన్ విజయాలు సాధించగా, ప్రజ్ఞానంద, అర్జున్ పాయింట్లు పంచుకున్నారు.










Comments