మరో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఉదయం ఫ్లాట్గా మొదలై క్రమంగా కుప్పకూలాయి. నిఫ్టీ 25 వేల దిగువకు పడిపోయింది. 260 పాయింట్లు కోల్పోయి 24,950 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 935 పాయింట్లు పడి 81,250 వద్ద కొనసాగుతోంది. ట్రెంట్ షేర్లు 3%, ICICI బ్యాంక్ 2.52%, BE 2.1%, L&T 1.86% నష్టపోయాయి. అటు డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ సైతం భారీగా పడిపోయింది. డాలర్కు రూ.91.31 వద్ద ట్రేడవుతోంది.










Comments