డేవిస్ కప్లో భారత్కు నిరాశ
సియోల్: డేవిస్కప్లో భారత జట్టు పోరాటం క్వాలిఫయర్ రెండో రౌండ్లోనే ముగిసింది. దక్షిణ కొరియా 3-1 ఆధిక్యంతో భారత్పై గెలిచి డేవిస్ కప్ ఫైనల్ 8లో చోటు దక్కించుకుంది. కొరియాతో పోరులో భాగంగా శుక్రవారం రెండు సింగిల్స్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజైన శనివారం జరిగిన డబుల్స్లో భారత జోడీ దక్షిణేశ్వర్/శ్రీరామ్ బాలాజీ 6-3, 3-6, 6-3తో నామ్ జి సంగ్/పార్క్ ఉయి సంగ్ జంటపై గెలిచి ఆశలు రేపింది. కానీ కీలక రివర్స్ సింగిల్స్లో సుమిత్ నగాల్ 1-6, 2-6తో సూన్వూ క్వోన్ చేతిలో ఓడడంతో 3-1తో కొరియా స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లింది.










Comments