• Jan 15, 2026
  • NPN Log

    ఘనంగా ఏపీటీఎఫ్ నేత ఎన్. పరమేశ్వరరావు వర్ధంతి వేడుకలు
    ఉరవకొండ npn,news.జ నవరి 11:
    స్థానిక ఏపీటీఎఫ్ (APTF) ప్రాంతీయ కార్యాలయంలో ప్రముఖ ఉపాధ్యాయ సంఘం నేత ఎన్. పరమేశ్వరరావు గారి నాలుగవ వర్ధంతి వేడుకలు ఆదివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
    56 ఏళ్ల అంకితభావం.. ఆదర్శప్రాయం:
    ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలు మాట్లాడుతూ.. పరమేశ్వరరావు గారు తన 75 ఏళ్ల జీవితకాలంలో 56 సంవత్సరాల పాటు ఏపీటీఎఫ్ సంఘం బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర కార్యాలయ సహాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తన నిబద్ధతతో రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నత పదవులను అధిరోహించారని గుర్తు చేశారు.
    సంఘం కోసం అంకితమైన జీవితం:
    సంఘం ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో ఆయన చూపిన ధైర్యం, ఐక్యతను కాపాడటంలో ఆయన పాత్ర మరువలేనిదని నేతలు ప్రశంసించారు. "ఏపీటీఎఫ్ శ్వాసగా, ధ్యాసగా బతికిన ఆయన నిరాడంబర జీవితం నేటి తరం ఉపాధ్యాయులకు మార్గదర్శకం" అని జిల్లా కార్యదర్శి బి.సి. ఓబన్న పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    పాల్గొన్న ప్రముఖులు:
    ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ ఎం. శ్రీనివాసులు, జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు బండారు నారాయణస్వామి, ఉరవకొండ మండల గౌరవ అధ్యక్షులు లోకేశ్, ప్రధాన కార్యదర్శి భువనేశ్వర్ చౌదరి పాల్గొన్నారు. అలాగే వజ్రకరూరు మండల ప్రధాన కార్యదర్శి ఎస్. ధనుంజయ, జిల్లా కౌన్సిలర్లు బి. చంద్రశేఖర్, సాకే మునిస్వామి, ఎ. కృష్ణ, కె. రాముడుతో పాటు సీనియర్ నాయకులు ఎం. మహేశ్వరప్ప, ఎస్. సురేష్, ఎం.కె. నాగరాజు, ఆది రాజేష్, కిషోర్ కుమార్, ఎం. సూర్య ప్రకాష్, వెంకటస్వామి, ఎం. ఓబన్న, వాల్మీకి చంద్రశేఖర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement