స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అమరావతి : స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 419 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. 110 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్, ఫార్మసిస్టుల పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నట్లు విడుదల చేసిన నోటిఫికేషన్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జూన్ 13వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులైన అభ్యర్థులకు సూచించింది.










Comments