12 యేళ్ల అనంతరం విరబూసిన కురింజి పుష్పం
చెన్నై: బ్రహ్మకమలం అనే పువ్వు 12యేళ్లకు ఒకసారి మాత్రమే వికిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందిన నీలంరంగు కురిం జి పుష్పం పుష్కర కాలం తరువాత ప్రస్తుతం నీలగిరి, కొడైకెనాల్ పశ్చిమ కనుమల్లో విరబూసింది. ‘స్ట్రోఫిలాంథాస్’అనే శాస్త్రీయనామం కలిగిన ఈ అరుదైన పుష్పం గూడలూరు మండలంలోని ఓవేలి అటవీ ప్రాంతంలో వికసించిందని అటవీశాఖ అధికారులు రాష్ట్రప్రభుత్వ ఉద్యానవన శాఖకు తెలియజేశారు.
ఈ నీలంరంగు కురింజి పుష్పం సోయగాన్ని తిలకించేందుకు పర్యాటకులను అనుమతించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ఉత్తర్వులతో పర్యాటకులు పెద్దసంఖ్యలో వెళ్లి నీలంరంగు కురింజి పుష్పాన్ని చూసి ఆనందంతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
Comments