97% మందికి వైకుంఠ ద్వార దర్శనం
ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల పవిత్రతను కాపాడేేందుకు భక్తుల సహకారం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. వైకుంఠ ఏకాదశిని అద్భుతంగా నిర్వహించిన TTDని అభినందించారు. డిసెంబర్ 30-జనవరి 8 వరకు 7.83 లక్షల మందికి వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 97% మంది సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం అభినందనీయమన్నారు. క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ నుంచి అమలు చేసిన అన్ని విధానాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు.










Comments