• Jun 13, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇటీవల ప్రకటించిన చర్యలతో దేశీయ బ్యాంకులు ప్రవాస భారతీయుల విదేశీ కరెన్సీ డిపాజిట్ల కోసం పెద్దఎత్తున రంగంలోకి దిగాయి. ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్లుగా పిలిచే ఈ డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ ఆఫర్‌ చేస్తూ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుతో సహా ప్రధాన బ్యాంకులన్నీ పెద్దఎత్తున ప్రచారానికి దిగాయి. బ్యాంకులు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఈ ఖాతాల ద్వారా సేకరించే ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్లను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేసి, అందుకు సమానమైన రూపాయలు పొందవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

    దీంతో బ్యాంకులపై ఫారెక్స్‌ మార్కెట్లో ఏర్పడే ఆటుపోట్ల ప్రభావమూ ఉండదు. ఈ సౌలభ్యంతో బ్యాంకులు ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్ల సమీకరణ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాయి.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement