• Jun 05, 2026
  • NPN Log

    అమరావతి : ఈ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తున్న పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వక్రీకరిస్తూ అనేక తప్పులు దొర్లడంపై ‘ది పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (పాప్‌)’ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రం తెలుగు మీడియం పాఠ్యపుస్తకంలో ‘కాకతీయ రాజ్యం’ అధ్యాయం (పేజీలు 222 నుంచి 244 వరకు)లో కొన్ని చారిత్రక తప్పులు దొర్లాయని, విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని ‘పాప్‌’ పేర్కొంది. 6, 7 తరగతుల తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠ్యపుస్తకాల్లోనూ తప్పులు దొర్లాయని తెలిపింది. చారిత్రక, ముద్రణ , అనువాద తప్పులపై విచారణ చేసి.. ఎస్‌సీఈఆర్‌టీ రాష్ట్ర డైరెక్టర్‌, రచయితలు, పబ్లిషర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement