భక్తుల మనోభావాలపై దెబ్బకొడుతున్నారా డీజే పూర్తిగా బ్యాన్ చేసే శక్తి ఉంటే తక్కువ సౌండ్తో అనుమతించే హక్కు లేదా
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కనపెట్టి పెనుగంచిప్రోలు దేవస్థానం నిర్ణయం
పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. గత అనేక దశాబ్దాలుగా భక్తులు తమ మొక్కుబడులను వివిధ రకాలుగా తీర్చుకుంటూ సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ వస్తున్నారు
అయితే ఆలయ పరిసర ప్రాంతాల్లో డీజే సౌండ్ను పూర్తిగా నిషేధిస్తూ దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై భక్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. డీజే శబ్ద కాలుష్యంపై నియంత్రణ అవసరమైతే నిర్ణీత డెసిబెల్ పరిమితుల్లో తక్కువ శబ్దంతో కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కల్పించవచ్చుకదా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు








Comments