ఆ యంగ్ ప్లేయర్కు వరంగా మారిన గిల్ గాయం!
ఇంటర్నెట్ డెస్క్: లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది. ఈక్రమంలో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు ప్రొటీస్ జట్టు కూడా ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ను సమం చేయాలని భావిస్తుంది. ఇది ఇలా ఉంటే చివరి మ్యాచ్ కోసం భారత్ జట్టులో పలు మార్పులు జరగనున్నాయి.
గిల్ కి గాయం..సంజూకి వరం
నాలుగో టీ20కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా భారత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పాదానికి గాయమైంది. దీంతో చివరి రెండు టీ20లకు అతడు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయం కారణంగా గిల్ దూరంగా చివరి మ్యాచ్ కు దూరం కావడంతో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి తుది జట్టులోకి రానున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను సంజూ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్లో ఇప్పటివరకు బెంచ్కే పరిమితమైన సంజూ.. 2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తన ఫామ్ను నిరూపించుకోవడానికి చివరి టీ20 మ్యాచ్ మంచి అవకాశం అని క్రీడా నిపుణులు చెబుతున్నారు. దీంతో సంజూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిల్ కోసం సంజూను బెంచ్ కే పరిమితం చేశారని, అయితే అనూహ్యంగా సంజూకు జట్టులో చోటు దక్కిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
మరోవైపు ఈ కీలక మ్యాచ్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటుపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ అతడు జట్టుతో కలవకపోతే హర్షిత్ రాణా ప్లేయింగ్ ఎలెవన్లో కొనసాగనున్నాడు. అదేవిధంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్ధానంలో ప్రధాన జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ షాబాజ్ ఆహ్మద్కు ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం లభించకపోవచ్చు.
భారత తుది జట్టు (అంచనా):
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.










Comments