కోహ్లీ, రోహిత్కు షాక్
ముంబై: సెంట్రల్ కాంట్రాక్టుల వ్యవహారంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాకివ్వనుందని తెలుస్తోంది. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేలు మాత్రమే ఆడుతున్న వీరిద్దరినీ బి-గ్రేడ్కు మార్చే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎ-ప్లస్ గ్రేడ్ను పూర్తిగా తొలగించి ఇకపై ఎ,బి,సి గ్రేడ్లను మాత్రమే కొనసాగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించింది. అపెక్స్ కౌన్సిల్ దీన్ని ఆమోదిస్తే రో-కోకు బి-గ్రేడ్ తప్పదని భావిస్తున్నారు.










Comments