• Dec 18, 2025
  • NPN Log

    అమరావతి : నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు ఊరట లభించలేదు. అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్ బెయిల్ పిటిషన్లను ఎక్సైజ్ కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏడుగురు నిందితులు.. బాదల్ దాస్ (A7), ప్రదీప్ దాస్ ( A8), కళ్యాణ్ ( A12), రవి (A4), శ్రీనివాస్ తిరుమలశెట్టి (A13), శ్రీనివాస్ రెడ్డి (A11), సతీష్ (A17) లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


    నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి శ్రీరాములు, అద్దేపల్లి జనార్దన్ రావు (A1)తోపాటు ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు (A2)తోపాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులు నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ కోసం వీరు ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


    ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిపిన కోర్టు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఈ నలుగురికి తప్పించి.. మిగిలిన ఏడుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి బ్రదర్స్‌కు జోగి బ్రదర్స్ అండగా ఉండి ప్రోత్సహించినట్లు కోర్టుకు ఆధారాలను ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇప్పటికే అందజేశారు.

    ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కోర్టు ఈ నలుగురి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురికి ఈ రోజుతో రిమాండ్ ముగియనుంది. దాంతో వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు పోలీసులు వీరిని హజరుపరిచారు. డిసెంబర్ 31వ తేదీ వరకు వారి రిమాండ్‌ను పొడిగిస్తూ.. ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

    అయితే తమను నెల్లూరు కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు మార్చాలంటూ వీరు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం విచారిస్తామని ఎక్సైజ్ కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement