ప్రమాదాల నివారణకు ‘స్టాప్ - వాష్ అండ్ గో’
(కర్నూలు - క్రైమ్): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో పోలీసులు ‘స్టాప్ - వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలను ఆపి, డ్రైవర్లచేత ముఖం కడిగించి నిద్రమత్తు వదిలిస్తున్నారు. ఆదోని, పత్తికొండ, కర్నూలు డివిజన్లలోని హైవేలపై ఈ తనిఖీలు ముమ్మరం చేశారు. అతివేగం, రాంగ్ రూట్ వెళ్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.










Comments