మార్కెట్లోకి టయోటా ఈవీ
ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఏం).. దేశీయ మార్కెట్లోకి తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) అర్బన్ క్రూయిజర్ ఇబెల్లాను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ కారును గుజరాత్లోని సుజుకీ మోటార్ ప్లాంట్లో ఉత్పత్తి చేయనున్నట్లు టీకేఎం డిప్యూటీ ఎండీ తడాషీ అసజుమా తెలిపారు. 49,61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉండనుంది. ఒకసారి చార్జింగ్తో 543 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందన్నారు.










Comments