• Sep 20, 2026
  • NPN Log

    అమరావతి: రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుదీర్ఘకాలంగా అమలు చేస్తున్న మెరిట్‌ ఆధారిత వెయిటేజ్‌ విధానానికి బదులుగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

    వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామక ప్రక్రియను మెరిట్‌ ఆధారంగా చేపట్టాలని ఈ నెల 13, 14 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టేలా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపికలో రాత పరీక్ష కీలకంగా మారనుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement