హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం.. అయితే!
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలోని హజ్ యాత్రికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి రూ.లక్ష అందించనున్నట్లు తెలిపింది. అయితే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్కు వెళ్లే వారికే ఈ సాయం అందుతుందని చెప్పింది. ఆదాయంతో సంబంధం లేకుండా విజయవాడ నుంచి వెళ్లేవారికి రూ.లక్ష అందజేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు మైనార్టీ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.









Comments