కోహ్లీ జెర్సీ నంబర్తో బరిలోకి పంత్
గాయం నుంచి కోలుకున్న భారత క్రికెటర్ రిషభ్ పంత్ దక్షిణాఫ్రికా-Aతో అనధికారిక టెస్టు మ్యాచులో బరిలో దిగారు. ఈ క్రమంలో ఆయన ధరించిన జెర్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. కోహ్లీ జెర్సీ నంబర్ 18ని ధరించడమే దానికి కారణం. పంత్ జెర్సీ నం-17 కావడం గమనార్హం. అయితే పొరపాటున ఇలా జరిగిందా? లేదా కావాలనే ధరించారా? అనే విషయమై అభిమానుల్లో చర్చ నెలకొంది. కాగా కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.









Comments