తెలిసినవారే.. తెగిస్తున్నారు..
అత్యాచార ఘటనల్లో 98 శాతానికి పైగా నిందితులు బాధితురాళ్లకు పరిచయస్థులేనని జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక వెల్లడిస్తోంది. వీరిలో ఆన్లైన్ వేదికల ద్వారా పరిచయమైనవారే ఎక్కువ మంది. చాలా ఘటనల్లో ఇరుగుపొరుగు వారు, సహోద్యోగులు, యజమానులు నిందితులు కాగా, కొన్ని కేసుల్లో మాత్రం కుటుంబసభ్యులే అకృత్యాలకు పాల్పడ్డట్లు రికార్డులు సూచిస్తున్నాయి. కాబట్టి అమ్మాయిలు తెలిసినవారైనాసరే అప్రమత్తంగా ఉండటం మంచిది.
Comments