భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!
వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను దాదాపు 95% ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగొచ్చని తెలుస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది.
Comments