మేం వెళ్తున్నాం.. ఫ్లైట్ బుక్ చేశాం: సూర్య
T20 ప్రపంచ కప్ లో ఈనెల 15న జరిగే లీగ్ మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేయడం పై టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంలో తమ జట్టు సన్నద్ధతలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ‘మేం స్పష్టంగానే ఉన్నాం. వాళ్ల(పాకిస్థాన్)తో ఆడబోమని మేం చెప్పలేదు. అలా అన్నది వాళ్లే. USA, కెనడాతో మ్యాచ్ల తర్వాత మేం కొలంబో వెళ్తాం. మా ఫ్లైట్ బుక్ అయింది. మేం వెళ్తున్నాం’ అని కెప్టెన్స్ మీట్లో చెప్పారు.










Comments