స్మృతి మంధానపై పాట
తిరువనంతపురం: మరికొద్ది రోజుల్లో ప్రారంభమవనున్న ఐసీసీ వన్డే వరల్డ్క్పలో భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సత్తా చాటాలని ఆకాంక్షిస్తూ ప్రొఫెసర్ వశిష్ఠ్ ఆమెపై పాట రూపొందించారు. కాలికట్లోని మలబార్ క్రిస్టియన్ కాలేజీలో హిస్టరీ శాఖ విభాగాధిపతిగా వశిష్ట్ గతంలో పనిచేశారు. ఈ పాటను వశిష్ఠ్ రాయగా, అతడి శిష్యురాలు సిలు ఫాతిమా ఆలపించారు. ప్రతి భారతీయురాలికి స్మృతి మంధాన ఒక స్ఫూర్తి ప్రదాత అని క్రికెట్లో ఆమె దేశానికి అందించిన రికార్డులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని ఈ పాటలో వివరించారు.
Comments