• Mar 02, 2026
  • NPN Log

    హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈనెల 8 నుంచి జరిగే హాకీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ కోసం భారత మహిళల జట్టును ప్రకటించారు. 20 మందితో కూడిన ఈ బృందానికి సలీమా టెటె సారథ్యం వహించనుంది. ఇక వ్యక్తిగత కారణాలతో వెటరన్‌ గోల్‌కీపర్‌ సవితా పూనియా ఈ టోర్నీకి దూరమైంది. మార్చి 14 వరకు ఈ క్వాలిఫయర్స్‌ జరుగనుంది. ఇందులో పాల్గొనే మొత్తం 8 జట్లను రెండు పూల్స్‌గా విభజించారు. పూల్‌ ‘ఎ’లో ఇంగ్లండ్‌, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా.. పూల్‌ ‘బి’లో భారత్‌, స్కాట్లాండ్‌, ఉరుగ్వే, వేల్స్‌ ఉన్నాయి. ఆగస్టులో జరిగే హాకీ వరల్డ్‌క్‌పలో మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఈ జట్లు పోటీపడనున్నాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement