• Oct 10, 2025
  • NPN Log
    • విశాఖపట్నం,( గాజువాక)

     

      భారత తూర్పు తీరంలోని లోతైన అల్-వెతర్ పోర్ట్ అయిన అదాని గంగవరం పోర్ట్ లిమిటెడ్ (AGPL) గంగవరం చేపల సంఘాల కోసం నిరంతర 24×7 బస్సు సేవను ప్రారంభించింది. మునుపటి వాహనాన్ని మార్చి,ఈ కొత్త సౌకర్యం రాత్రి–పగలు, సంవత్సరం పొడవునా స్థానిక మత్స్యకారుల రవాణా అవసరాలను తీర్చనుంది.

                 ఈ బస్సు సేవను అమిత్ మాలిక్, సిఇఓ – అదాని గంగవరం పోర్ట్,గంగవరం గ్రామ మత్స్యకార సంఘ సభ్యులు మరియు AGPL,అదాని ఫౌండేషన్  సమక్షంలో అధికారికంగా ప్రారంభించారు.

                 ఈ సేవ స్థానికుల జీవనోపాధి,సౌకర్యం మరియు రవాణా సౌలభ్యాన్ని పెంపొందించడానికి అదాని గంగవరం పోర్ట్ చేపట్టిన సుస్థిర అభివృద్ధి కార్యక్రమాల భాగం. స్థానికులు ఈ సేవకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు మరియు అదాని సంస్థ పేదల, మత్స్యకారులకై చేస్తున్న నిరంతర మద్దతును ప్రశంసించారు.

               ఈ సందర్భంగా అదాని గంగవరం పోర్ట్ మేనేజ్‌మెంట్ మాట్లాడుతూ నిజమైన అభివృద్ధి అంటే అందరి భాగస్వామ్య అభివృద్ధి.24×7 బస్సు సేవ గంగవరం మత్స్యకారుల భద్రత, సౌకర్యం మరియు జీవన ప్రమాణాల పెంపునకు మా నిబద్ధతను సూచిస్తుంది.ఇది స్థానిక కమ్యూనిటీతో మాకు ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement