• Jun 05, 2026
  • NPN Log

    అల్లు అర్జున్  కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్  ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఏఏ 23   వర్కింగ్‌ టైటిల్‌. అయితే ఈ సినిమా బడ్జెట్‌ కారణాల వల్ల ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ఇటీవలే వార్తలు వచ్చాయి. దీనిపై రచయిత రత్నకుమార్  పరోక్షంగా స్పందించి.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

    కమల్‌ హాసన్‌ హీరోగా లోకేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్‌’ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రత్నకుమార్‌ పోస్ట్‌ పెట్టారు. ‘విక్రమ్‌’ సినిమా ప్రారంభంలో లోకేశ్‌ పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేసిన రత్నకుమార్‌.. ఆ పోస్ట్‌ చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. ఆయన చిత్రాల్లో తాను కూడా భాగమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌తో లోకేశ్‌ చేయనున్నారు. సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘ఏఏ 23’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.

     

    దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోలేదని స్పష్టత వచ్చేసింది. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించి విడుదల చేసిన థీమ్‌ వీడియో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచేసింది. అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’లో నటిస్తున్నారు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో ఆయన పాత్ర పలు కోణాల్లో సాగనుంది. షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘ఏఏ 23’ మొదలయ్యే అవకాశం ఉంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement