• Oct 29, 2025
  • NPN Log

    Date28-10-2020,npn,news.విడపనకల్లు మండలంలో రెవిన్యూ అధికారులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విడపనకల్ మండలంలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన అంధుడైన కురువ ఎర్రి స్వామికి భూ సమాచారం విషయంలో అధికారులు చుక్కలు చూపించారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చి దరఖాస్తుదారుడుని గందరగోళానికి గురి చేశారు. మ్యుటేషన్ గందరగోళం భూమి ముటేషన్ భూమి మ్యుటేషన్ సందర్భంగా గొలుసు ఆధారిత పత్రాలు ప్రమాణికంగా తీసుకుంటారా. కేవలం రిజిస్ట్రేషన్ దస్తావేజులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా. ఏ చట్టం ఏం చెబుతుంది అని కురవ ఎర్రి స్వామి ప్రశ్నించారు. దీనికి విడపనకల్ తాసిల్దార్ బదులిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలు ఆధారంగా ముటేషన్ చేద్దామని తెలిపారు. అయితే గొలుసు పత్రాలు, పరిశీలించకుండా, న్యూ టేషన్ చేస్తే ఆస్తి చరిత్ర, అమ్మకాలు కొనుగోలు వివరాలు ఎలా తెలుస్తాయని ఎర్రి స్వామి అనుమానం వ్యక్తం చేశారు మరణ ధ్రువీకరణ పత్రాలతో ,ముటేషన్  ఇది ఇలా ఉండగా కొట్టాలపల్లి గ్రామానికి చెందిన మోదుపల్లి చంద్రబాబు తండ్రి నారాయణస్వామి అమ్మ మృతి చెందారు. కేవలం దరఖాస్తుదారుడు సమర్పించిన మరణ ధ్రువీకరణ పత్రాలు ఆధారంగానే అడ్డుగోలుగా  అక్రమంగా, సహజ నాయ సూత్రాలకు విరుద్ధంగా, మ్యుటేషన్ చేశారని వార్త కథనం పేర్కొంది .ఈ ముటేషన్ కోసం ఆస్తి తాలూకు గొలుసు పత్రాలు, సమర్పించకుండానే ప్రక్రియ పూర్తి చేయడం రెవిన్యూ మాయగా, అంధుడైన కురువ ఎర్రి స్వామి ఆందోళన వ్యక్తం చేశారు ధ్రువీకరించిన పత్రాలు సమర్పించకుండా సర్వేనెంబర్ కు సంబంధించిన తప్పుడు స్కెచ్ ను ,ఇచ్చి అందుడిని తప్పుదోవ పట్టించారు. సబ్ డివిజన్ కు సంబంధించిన పత్రాలు, భూ కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు ,రెవెన్యూ కార్యాలయంలో లేవంటూ అధికారులు చేతులెత్తేశారు. అడిగిన సమాచారం ఒకటైతే అందించిన సమాచారం మరొకటి అని పొంతన లేని తికమక సమాచారంతో దరఖాస్తుదారుడు బుర్ర గోక్కున్నాడు .లోపించిన జవాబుదారితనం రెవిన్యూ అధికారుల్లో జవాబుదారితనం పారదర్శకత పూర్తిగా లోపించిందని స్పష్టమవుతుంది. మొన్నటి సమాచారం ఇచ్చి అంధుడైన బాధ్యత దరఖాస్తుదారుడుని ఇబ్బందులు పాలు చేయడం వెనుక రెవిన్యూ మాయజాలం ఇంద్రజాలం ప్రదర్శించడమేనని అంధుడైన కురువ ఎర్రి స్వామి ఆరోపించారు. లోపభూయిష్టమైన, సమాచారం వెనుక బాధ్యులతో కుమ్మక్కైనట్లు ,వారిచ్చిన సమాధానాల ,ద్వారా స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు .సబ్ డివిజన్ కొనుగోలు రికార్డులు ఉన్నాయా లేవా అనే అంశాన్ని తేల్చకుండా ఒంటెత్తు పొగడలతో సమాధానాలు ఇవ్వడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎర్రి స్వామి ఆవేదన వ్యక్తం చర్యలు తీసుకోవాలని ఎర్రి స్వామి అంధుడైన డిమాండ్ చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement