• Jul 27, 2026
  • NPN Log

    ఇటీవలి కాలంలో కంప్యూటర్, మొబైల్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల చిన్న వయసులోనే మసక దృష్టి, కంటి అలసట, కళ్లు పొడిబారడం, డిజిటల్ ఐ స్ట్రెయిన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పోషకాలు అధికంగా ఉండే కొన్ని ఆహారాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా అవిసె గింజలు, గుమ్మడి గింజలు కంటి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

    అవిసె గింజలు

    అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్ ఇ, లిగ్నాన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడటానికి, పొడి కంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కంటి వాపును తగ్గించి, కన్నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి.

    గుమ్మడికాయ గింజలు

    గుమ్మడి గింజలలో జింక్, మెగ్నీషియం, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి రెటీనా పనితీరుకు జింక్ ఒక ముఖ్యమైన పోషకం. ఇది వయసు సంబంధిత దృష్టి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడవచ్చు. ఈ గింజలను వేయించుకుని తినవచ్చు లేదా సలాడ్లు, పెరుగు, స్మూతీలు, ఓట్స్‌లో కలుపుకోవచ్చు.

    కంటి చూపుకు సహాయపడే ఇతర ఆహారాలు

    గింజలు మాత్రమే కాదు, ఈ ఆహార పదార్థాలను కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచివని నిపుణులు సూచిస్తున్నారు.

    క్యారెట్లు

    పాలకూర, మెంతులు, ఆకుకూరలు

    గుడ్డు

    చేపలు

    నారింజ, నిమ్మకాయ

    బాదం, వాల్‌నట్‌లు

    కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ అలవాట్లను పాటించండి

    ప్రతి 20 నిమిషాలకు 20-20-20 నియమాన్ని పాటించాలి. (ప్రతీ 20 నిమిషాల స్క్రీన్ సమయం తర్వాత, కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును, కనీసం 20 సెకన్ల పాటు చూడాలి)

    రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి.

    పుష్కలంగా నీరు తాగాలి.

    తీవ్రమైన సూర్యరశ్మిలో UV రక్షణ ఉన్న సన్ గ్లాసెస్ ధరించాలి.

    సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement