• Dec 19, 2025
  • NPN Log

    భారత్‌లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ JSW MG మోటార్ ఇండియా తమ వాహనాల ధరలను 2026 జనవరి 01 నుంచి ప్రస్తుత ధరలపై 2 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, మాక్రో ఎకనామిక్ కారకాలు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.


    ఈ ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. హెక్టర్, ఆస్టర్, కామెట్ EV, విండ్సర్ వంటి పాపులర్ మోడల్స్‌పై ఈ ప్రభావం ఉంటుంది. ఇటీవలే 2026 MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ.11.99 లక్షల నుంచి లాంచ్ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. మెర్సిడెస్-బెంజ్, BMW వంటి లగ్జరీ కార్ల కంపెనీలు కూడా 2026 జనవరి నుంచి ధరలు పెంచుతున్నాయి. కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారు డిసెంబర్‌లోనే బుక్ చేసుకోవడం మంచిది! JSW MG మోటార్ ఈవీ రంగంలో కూడా బలోపేతమవుతోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement