ఏపీ స్ఫూర్తితో తెలంగాణలో అధికారం చేపడతాం: బండి సంజయ్
కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మోదీ-అటల్ సుపరిపాలన యాత్రలో భాగంగా విశాఖలో వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పోరాటాల గడ్డ వైజాగ్కు వచ్చిన ప్రతిసారీ ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అమల్లో ఉంది. ఇక్కడి పరిస్థితులను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో అధికారంలోకి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.










Comments