ఓర్వకల్లు హైవేపై ‘నయారా’ బంక్ ప్రారంభం
ఓర్వకల్లు జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ‘నయారా’ పెట్రోల్ బంక్ను పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి సోమవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి అమ్మకాలను ప్రారంభించారు. వాహనదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బంక్ యాజమాన్యం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.








Comments