• Dec 11, 2025
  • NPN Log

    టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా తన సహచరులతో రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీతో చేసిన రీల్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 విజయం తర్వాత.. బుమ్రాపై అర్ష్‌దీప్ సరదా వ్యాఖ్యలు చేశాడు.

    ‘జెస్సీ భాయ్ ఇంకా మరిన్ని వికెట్లు తీసుకోవాలి. అప్పుడే నా ఇన్‌స్టాలో కనిపిస్తాడు. వికెట్ల తీసుకునే విషయంలో బుమ్రా మరింత కసరత్తు చేయాలి. అది జరిగితేనే నేను అతడితో రీల్ చేస్తా’ అని అర్ష్‌దీప్ సరదాగా అన్నాడు.

    అది నాకిష్టం..

    బుమ్రాతో అతడికున్న అనుబంధాన్ని అర్ష్‌దీప్ సింగ్ పంచుకున్నాడు. ‘నాకు జెస్సీ భాయ్‌తో మంచి అనుబంధం ఉంది. పైగా మేమిద్దరమూ పంజాబీలమే. అతడు జట్టులో సీనియర్ అయినప్పటికీ యువ క్రికెటర్లతో ఎప్పుడూ కఠినంగా ఉండడు. అందరితోనూ చాలా సౌమ్యంగా మాట్లాడుతాడు. అతడితో కలిసి బౌలింగ్ చేయడం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాటర్లు నా బౌలింగ్‌లో అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను వికెట్లు తీయడానికే గేమ్‌లో ఉన్నా. కానీ వారు నేను వేసే మంచి బంతుల్లోనూ పరుగులు సాధించాలని చూస్తారు. బుమ్రా విషయంలో మాత్రం అలా కాదు. బ్యాటర్లకు అంత తేలిగ్గా పరుగులు ఇవ్వడు. అతడితో కలిసి బౌలింగ్ చేసేటప్పుడు ఇది కూడా నాకు కలిసి వస్తుంది’ అని అర్ష్‌దీప్ సింగ్ వివరించాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement