ఈ-క్రాప్ నమోదుకు ఈ నెల 25 తుది గడువు
ఆంధ్ర ప్రదేశ్ లో ఖరీఫ్ పంటలకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు, సిబ్బందికి.. ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. నమోదులో భాగంగా సవరణలు, సామాజిక తనిఖీ, ఇతర మార్పులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని, 31న తుది జాబితా విడుదల చేయాలని అధికారులను ఢిల్లీరావు ఆదేశించారు. ఈ క్రాప్ నమోదుకు సెప్టెంబర్-30ని చివరి తేదీగా ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. తాజాగా ఆ గడువును పెంచింది.
Comments