కూటమి పాలనలో ఆలయాలకు భక్తుల తాకిడి: ఆనం
ఆంధ్ర ప్రదేశ్ లో రూ.83Crతో 706 ఆలయాల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కూటమి పాలనలో ఆలయాలకు భక్తుల తాకిడి 75% పెరిగిందని చెప్పారు. నెల్లూరు(D) పెంచలకోన బ్రహ్మోత్సవాల సమీక్షలో మాట్లాడుతూ ‘5,900 చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నెలకు రూ.10వేల చొప్పున ఇస్తున్నాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మూడోసారి పుష్కరాలు జరగనుండటం ఆంధ్రులకు గర్వకారణం’ అని పేర్కొన్నారు.










Comments