పవన్ త్వరలోనే కోలుకుంటారు: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. సైనసైటిస్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్కు నిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.









Comments