దసరా స్పెషల్.. ఆర్టీసీకి ₹110 కోట్ల ఆదాయం
దసరా నేపథ్యంలో ₹110 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలంగాణ ఆర్టీసీకి తెలిపింది. 7,754 స్పెషల్ బస్సులు తిప్పాలని నిర్ణయించినా ప్రయాణికులు లేకపోవడంతో 5,300 బస్సులే నడిపినట్లు వెల్లడించింది. గతేడాది 6,300 ప్రత్యేక బస్సులు వేయగా ₹114 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. ఈసారి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గడం, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో ఆదాయం తగ్గినట్లు వివరించింది. కాగా ఇవాళ, రేపు బస్సుల్లో రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది.
Comments