ఇ కామర్స్ సంస్థలపై ప్రభుత్వ నిఘా
న్యూఢిల్లీ: జీఎ్సటీ తగ్గింపు ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులకు చేరాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఇ-కామర్స్ సంస్థలు రోజువారీ వినియోగంలో ఉన్న దాదాపు 54 వస్తువుల ధరలను తగ్గించిందీ లేనిదీ నిశితంగా గమనిస్తోంది. ఇందుకోసం ఆ సంస్థల అమ్మకాల పైనా నిఘా పెట్టినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఇప్పటికే దాదాపు ప్రతి ప్రధాన ఎఫ్ఎంసీజీ కంపెనీ జీఎ్సటీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఆన్లైన్లో కొన్ని కంపెనీలు ఇంకా ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments