ఈ నెల 10న భారత్కు అఫ్గాన్ ఫారిన్ మినిస్టర్!
అఫ్గాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాఖీ ఈ నెల 10న తొలిసారి భారత పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించనున్నారు. 2021లో అఫ్గాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆయనే ఆ దేశ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. కాగా ఈ ఏడాది జనవరి లో ముత్తాఖీతో ఇండియా ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్ట్రీ దుబాయిలో సమావేశమయ్యారు. హెల్త్ సెక్టార్లో అఫ్గాన్ కు భారత్ అందించే సాయంపై చర్చించారు.
Comments