• Mar 02, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న అరబిందో ఫార్మా తన పెన్సిలిన్‌-జీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరిస్తోంది. కాకినాడలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌)లో ఏర్పాటు చేసిన ఈ పెన్సిలిన్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యం వచ్చే ఏడాది కాలంలో 10,000 టన్నులు మించిపోతుందని ఇన్వెస్టర్స్‌ కాల్‌లో సంస్థ సీఎ్‌ఫఓ సుబ్రమణియన్‌ చెప్పారు. ముందు ముందు ఈ ప్లాంట్‌ స్థాపిత వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 15,000 టన్నులకు చేరుతుందన్నారు.

     

    పెన్సిలిన్‌-జీ ప్రాధాన్యత

    పెన్సిలిన్‌-జీ అనేక కీలక యాంటీ బయాటిక్స్‌ ఔషధాలకు ప్రధాన ముడి పదార్ధం. ప్రస్తుతం ఈ ముడి పదార్ధం కోసం మన దేశ ఫార్మా కంపెనీలు ఎక్కువగా చైనా కంపెనీలపై ఆధారపడుతున్నాయి. దీన్ని తగ్గించేందుకు పెన్సిలిన్‌-జీతో సహా ఫార్మా పరిశ్రమకు అవసరమైన కీలక ముడి పదార్ధాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా అరబిందో ఫార్మా కాకినాడలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి క్రమంగా ఉత్పత్తి పెంచుతోంది. మరోవైపు పెన్సిలిన్‌-జీ దిగుమతికి కనీస ధర నిబంధనను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించడం సానుకూల పరిణామమని సుబ్రమణియన్‌ అన్నారు.

     

    బ్రేక్‌ఈవెన్‌కు చైనా ప్లాంట్‌

    ఓరల్‌ సాలిడ్‌ డోసేజీ (ఓఎ్‌సడీ) ఔషధాల కోసం చైనాలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ ఈ ఏడాది మార్చితో ముగిసే త్రైమాసికంలో లాభనష్టాలు లేని స్థితికి (బ్రేక్‌ ఈవెన్‌) వస్తుందని సుబ్రమణియన్‌ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి ఈ ప్లాంట్‌ కంపెనీ లాభాలకు బాగా తోడ్పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే ఔషధాలకు యూరోపియన్‌ దేశాల నుంచి 10 అనుమతులు, చైనా ప్రభుత్వం నుంచి 3 అనుమతులు లభించిన విషయాన్ని సుబ్రమణియన్‌ గుర్తు చేశారు. కాగా మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభాల శాతం ఎంత లేదన్నా 20 నుంచి 21 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement