కాంగ్రెస్తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్
2027 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో తమకు పొత్తు ఉండదని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎమ్మెల్యేలను సరఫరా చేసే పార్టీగా మారింది. భవిష్యత్తులో తమ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలోకి వెళ్లరని ఓటర్లకు కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా? 2017-19 మధ్య 13 మంది, 2022లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు’ అని గోవాలో జరిగిన పార్టీ మీటింగ్లో వ్యాఖ్యానించారు.
Comments