మహిళలకు వారి హక్కులు దక్కనివ్వలేదు: అమిత్ షా
రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు మహిళల హక్కు అయిన 33% కోటా వారికి దక్కనివ్వకుండా చేశాయని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల మనస్తత్వం మహిళలకుగానీ, దేశానికిగానీ అనుకూలంగా ఉండదని మండిపడ్డారు. నారీశక్తికి జరిగిన ఈ అవమానానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇకపై ప్రతిఎన్నికల్లో ప్రతిపక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని Xలో పోస్ట్ చేశారు.










Comments